ఠాణా మెట్లు ఎక్కిన వృద్ధురాలు
మంతని, సెప్టెంబర్ 29 (విజయక్రాం తి): పది నెలలు కడుపులో మోసి, జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లిని ఇంటి నుంచి గెంటే శారు. ప్రబుద్ధులు. తన ఇద్దరు కొడుకులు ఇం టి నుంచి గెంటివేయడంతో ఓ తల్లి న్యాయం కోసం ఆదివారం ఉదయం మంథ ని పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కింది. ముత్తా రం మండలంలోని ఖమ్మంపల్లి గ్రా మానికి చెందిన బగ్గని మల్లవ్వ(75)కు బగ్గని స్వామి, మొగిళి ఇద్దరు కు మారులు.
ఆమె తాను సంపాదించిన ఆరు ఎకరాల భూమిని కొడుకులిద్దరికీ పంచింది. ఇప్పుడు ఆమెకు అన్నం పెట్టకుండా, భార్యలతో కలి సి ఇబ్బందులు పెడుతున్నారని మల్లవ్వ ఆరో పించారు. ఇంట్లో నుంచి కూడా గెంటివేశారని పోలీసుల ఎ దుట అవేదన వ్యక్తం చేసింది. వారి తో తనకు ప్రాణభయం ఉన్నదని రక్షణ కల్పించాలని పోలీసులను కో రింది. మల్లవ్వకు న్యాయం చేస్తామని సీఐ రాజు తెలిపారు.