17-02-2025 06:47:59 PM
చేగుంట (విజయక్రాంతి): పట్టణ కేంద్రంలో గల శ్రీ రేణుక మాత ఆటో యూనియన్ మక్కా రాజుపేట రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద రెండు సిమెంటు బెంచీలు ఏర్పాటు చేసిన కుమారులు, వివరాలకు వెళితే చేగుంట పట్టణనికి చెందిన సిరిగోజీ బాల పోచయ్య గత కొన్ని రోజుల కితం అనారోగ్య కారణాల వల్ల మరణించారు. వారి జ్ఞాపకార్థం వారి కుమారులు రవి, స్టాలిన్ నర్సిములు ఆటో స్టాండ్ వద్ద ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రెండు సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేసారు. తమ ఇబ్బందులు గుర్తించి బెంచిలను ఏర్పాటు చేసినందుకు వివిధ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.