కామారెడ్డి, అక్టోబర్ 1(విజయక్రాంతి): తల్లిని చంపిన కొడుక్కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి జిల్లా అదనపు న్యాయాధికారి లాల్సింగ్ శ్రీనివాస్నాయక్ మంగళవా రం తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ సింధూశర్మ తెలిపారు. 29 మార్చి 2021న పెద్దకొడప్గల్ గ్రామానికి నాగవ్వను ఆమె కుమారుడు వడ్డె నర్సిం లు మద్యం డబ్బుల కోసం అడుగగా ఇవ్వలేదు. దీంతో తల్లితో గొడ వపడిన నర్సింలు ఆమెను కర్రతో కొట్టగా చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదవగా న్యాయాధికారి మంగళవారం తీర్పునిచ్చారు.