calender_icon.png 17 October, 2024 | 4:55 PM

మామ చేతిలో అల్లుడు హతం

17-10-2024 12:04:15 AM

బెల్లంపల్లి, అక్టోబర్ 16: కుటుం బ కలహాలతో మనస్థాపానికి గురై న మామ, అల్లుడ్ని హత్య చేసిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలో చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా గోమాస నరేందర్(37)కు మామ గోలేటి శంకర్‌కు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి శంకర్ నరేందర్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.