calender_icon.png 25 October, 2024 | 2:57 AM

తండ్రికి కర్మ చేస్తూ తనయుడి మృతి

25-10-2024 12:54:04 AM

* కోనేరులో స్నానానికి వెళ్లి గల్లంతు

సూర్యాపేట,అక్టోబర్24(విజయక్రాంతి): తండ్రి కర్మకాండ చేస్తూ స్నానానికి వెళ్లి కోనేరులో మునిగి కొడుకు మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్)మండలం పాత సూర్యాపేటలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోలోజు మహేశ్ చారి (22) తండ్రి రుక్మాచారి నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. రుక్మాచారికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు.

మహేశ్ తండ్రికి కర్మకాండ చేసేందుకు కుటుంబ సభ్యులు గ్రామంలోని చక్రయ్యగుట్ట వద్దకు వెళ్లి పిండ ప్రదానం చేశారు. అనంతరం అక్కడే ఉన్న కోనేరులో స్నానం కోసం వెళ్లగా ఒడ్డు నుంచి కాలుజారి నీటిలో మునిగి పోయాడు. ఈత రాకపోవడంతో కోనేరులో మునిగి మృతిచెందాడు.

బంధు వులు పరిసర ప్రాంతాల రైతులను పిలి చి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి  విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్సై శంకర్ నాయక్ తెలిపారు.