calender_icon.png 25 September, 2024 | 10:05 PM

నల్గొండ జిల్లాలో ఘోరం.. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య

25-08-2024 11:05:13 AM

నిడమానూరు: నల్గొండ జిల్లా నిడమానూరు మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రావిరాల సాయమ్మ(65)ను కుమారుడు శివ గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. తల్లిని హత్య చేసిన అనంతరం శివ గొంతుకోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మద్యానికి బానిసై కుటుంబకలహాలతో తల్లిని చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న  మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.