calender_icon.png 29 September, 2024 | 7:28 PM

ఆస్తుల పంపకాల గొడవ

29-09-2024 05:46:39 PM

తండ్రిపై దాడి చేసి చంపిన కొడుకు

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఆస్తుల పంపకాల విషయంలో కొడుకు తండ్రిపై దాడి చేసి హత్య చేసిన ఘటన జిల్లాలో వేములవాడ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... పట్టణానికి చెందిన మమిండ్ల మల్లయ్య(51) తన మొదటి భార్య చనిపోవడంతో పద్మ అనే మహిళను పెళ్లి చేసుకోగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొద్ది రోజులుగా మొదటి భార్య సంతానం ముగ్గురు బిడ్డలు, కొడుకులు తమకు ఆస్తుల పంపకాల చేయాలని గొడవ జరుగతుంది. పెద్ద మనుషుల ఆధ్వర్యంలో పంచాయతీ నిర్వహించారు. అక్కడినుంచి కొడుకు, మరి కొందరు మల్లయ్య ఇంటిపైన దాడి చేసి విచక్షణ రహితంగా మల్లయ్య, పద్మల కొట్టడంతో మల్లయ్య అక్కడిక్కడే మృతి చెందారు. పద్మ తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటన పట్టణంలో సంచలనంగా మారింది.