calender_icon.png 28 September, 2024 | 6:51 AM

పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తా

28-09-2024 12:33:54 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి

మంచిర్యాల, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుంటానని అల్ఫో ర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్‌రెడ్డి అ న్నారు. శుక్రవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడారు.

నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం కోసమే రాజకీ యాల్లోకి వస్తున్నానని, తనను గెలిపిస్తే వారి గొంతుకనవుతానన్నారు. ఎమ్మె ల్సీగా వచ్చే వేతనాన్ని నిరుపేద విద్యార్థులకు, బ డుగు బలహీన వర్గాల ఉద్యోగు ల సంక్షేమానికి ఖర్చు చేస్తానన్నారు. ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పని చేస్తానన్నారు. అంతకు ముందు బార్ అసోసియేషన్, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, మే ధావులతో సమావేశాలు నిర్వహించారు.