calender_icon.png 25 September, 2024 | 6:02 AM

పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తా

25-09-2024 01:32:48 AM

  1. ఎమ్మెల్సీ వేతనం నిరుపేదలకు కేటాయిస్తా 
  2. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి

కరీంనగర్/మెదక్, సెప్టెంబరు 24 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వానికి, పట్టభద్రులకు వారధిగా పనిచేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్‌రెడ్డి అన్నా రు. మంగళవారం మెదక్‌లో  తెలంగాణ గు రుకుల పాఠశాల, ప్రభుత్వ హైస్కూ ల్ ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ కళాశాలల అ ధ్యాపకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీగా వచ్చే వేతనాన్ని కూడా నిరుపేద విద్యార్థులకు, బడుగు బలహీనవర్గాల ఉద్యోగుల సంక్షేమానికి వెచ్చిస్తానని వెల్లడించారు. పట్టభద్రులు తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు.