04-03-2025 12:33:32 AM
కామారెడ్డి, మార్చి 3 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డ్ కాలనీలో సంకష్ట హర గణపతి ఆలయంలో సోమవారం వేద పండి తులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు యజ్ఞం సంపత్ కుమార్ శర్మ రమాకాంత్ శర్మ పవన్ శర్మ వంశీ శర్మ అరవింద్ భరద్వాజ్ సతీష్ పాండే ల ఆధ్వర్యంలో పల్గనశుద్ధి చతుర్థి సంతత చతుర్థిని ఘనంగా నిర్వహించారు. సామూహికంగా యాగాలను నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఇదే రోజున పుత్ర కామేష్టి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యజ్ఞంలో పుత్రులు కావాలని కోరుకునే దంపతులు పాల్గొని నియమ నిబంధనలు పాటించాలన్నారు.