03-03-2025 11:29:03 PM
మలక్పేట: మమూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా నిరాశ్రయులైన మలక్పేటలని శంకర్నగర్ బాధితులతో ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పరామర్శించారు. సందరీకరణ పనుల్లో రివర్బెడ్ పరిధిలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించేందుకు, ఇళ్ల కూల్చివేత పరిసరాలను సందర్శించేందుకు సోమవారం ఉదయం మేధా పాట్కర్ శంకర్నగర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది స్థానికులు, నిరాశ్రయులతో మేధా పాట్కర్ మాట్లాడారు. సుందరీకరణ పనుల పేరుతో ఇళ్లను కూల్చి తీవ్ర అన్యాయం చేశారని బాధితులు ఆవేధన వ్యక్తం చేశారు.
సమాచారం తెలుసుకున్న చాదర్ఘాట్ పోలీసులు అక్కడికి చేరుకుని మేధా పాట్కర్ ను అడ్డుకున్నారు. శంకర్నగర్లో పర్యటించేందుకు అనుమతి లేదని, మేధాపాట్కర్ ను అక్కడి నుంచి వెళ్లిపోవల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా మేధా పాట్కర్ను అడ్డుకోవడంపై స్థానికులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ద్వజమెత్తారు. నిరాశ్రయులైన ప్రజల సమడు సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి వచ్చిన మేధాపాట్కర్ ను అడ్డుకోవడం సరైన పద్దతి కాదని స్థానికుడు సయ్యద్ బిలాల్ అభిప్రాయపడ్డారు.