హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నిధులపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (జీవోఐ-పీఎఫ్ఎంఎస్), ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్ఎంఐఎస్), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈకుబర్ ప్లాట్ఫామ్ మధ్య త్రైపాక్షిక ఖాతా లావాదేవీల కోసం అకౌంట్స్ విభాగాధిపతిని నియమించాలని నిర్ణయించింది.