నాగర్కర్నూల్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): ఇసుకఅక్రమ రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన నాగర్కర్నూల్ పోలీసులపై వేటు పడింది. మల్టీజోన్ లోని 9 జిల్లాల పరిధిలోని ముగ్గురు సీఐలు, 13మంది ఎస్సైలపై వేటు వేస్తూ ఐజీపీ డీ సత్యనారాయణ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. నాగర్కర్నూల్ జిల్లాలోని వీపనగండ్ల, బిజినపల్లి, తెలకపల్లి, వంగూర్, ఉప్పునుంతల మండలాల పోలీసు అధికారులను ఎస్పీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇసుక రవాణాతో సంబంధం ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విషయంలోనూ రహస్యంగా విచారణ జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.