calender_icon.png 24 October, 2024 | 7:54 PM

నలభై రోజుల్లో ఇస్మార్ట్ హవా షురూ

07-07-2024 12:05:00 AM

మరో నలభై రోజుల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ హవా షురూ కానుంది.. డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సిద్ధంగా ఉండండి అంటున్నారు దర్శకుడు పూరి జగన్నాధ్. రామ్ కథానాయకుడిగా, పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో ఛార్మీతో కలిసి ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఆగస్టు 15న తెరమీదికి రానున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రచార కార్రక్రమాల్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ‘స్టెప్పా మార్’ పాటతో అభిమానులతో ఇస్మార్ట్ స్పెప్పులేయిస్తున్న చిత్ర బృందం, త్వరలో ఓ రొమాంటిక్ గీతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: మణి శర్మ, సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు.