calender_icon.png 29 March, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రాగునీటి కోసం 2వ రోజు దీక్షలో మోకాళ్ళపై కూర్చుని నిరసన తెలిపిన గుడిసె వాసులు

26-03-2025 06:43:41 PM

త్రాగు నీటి సౌకర్యం కల్పించాలని సీపీఎం డిమాండ్..

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని సీఎస్పి బస్తీ, రాజీవ్ నగర్ శివారు ఇళ్ళు లేని నిరుపేదలు గత ఆరు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వారికి త్రాగునీరు మౌళిక వసతులు కరెంటు లేక విష సర్పాల కాటుకు గురై చలికి ఎండకు వానలకు అవస్తులు పడుతున్న ప్రభుత్వం, పాలకులు పట్టించుకోవడం లేదనీ సీపీఎం పార్టీ జిల్లా నాయకులు, పార్టీ మండల కార్యదర్శి అబ్దుల్ నబి, ఆలేటి కిరణ్ కుమార్ లు ఆరోపించారు. పట్టణానికి కూత వేటు దూరం ఉన్న పేదలకు త్రాగునీరు ఇవ్వక పోవడం శోచనీయం అని అన్నారు.

అడవులలో జీవిస్తున్న వన్య ప్రాణుల త్రాగునీటి కోసం ప్రభుత్వం చెక్ డ్యాంలు, నీటి తొట్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ప్రజల త్రాగునీటి సౌకర్యం కల్పించకపోవడం సబబు కాదని వారు అన్నారు. నేటికి  రెండవ రోజు నిరసన దీక్ష సందర్భంగా వినూత్న రీతిలో మోకాళ్ళపై కూర్చుని నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు మన్యం మోహన్ రావు అధ్యక్షత వహించగా తాళ్లూరి కృష్ణ, వజ్జ సురేష్, సుల్తానా, ఆలేటి సంధ్య, కల్లెపల్లి మరియా, ఆర్బీజే రాజు, వరంగంటి రాజ మొగిలిలు సంఘీభావం తెలిపారు. దీక్షలలో వీరభద్రం, వెంకన్న, సంతోష, సుజాత, కమల, కోటమ్మ, నీల, రాణి, జ్యోతి, కల్తి ఎస్తేరు, రాజు, హుస్సేన్, గోబ్రియా, మల్లయ్య, కౌసల్య, ఖైరన్, విజయ, కృష్ణ, యాకూబ్ పాషా, భవాని, రసూల్, లక్ష్మి, అమ్మి, ప్రమీల, రాంబాయి, మంగ తదితరులు పాల్గొన్నారు.