calender_icon.png 14 April, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ పూర్తి

03-04-2025 01:07:28 AM

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని అందిం చడమే లక్ష్యంతో చేపట్టిన శ్రీశైలం ఎడమ గట్టు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం కూలిందని చేతులు దులుపుకోలేమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మరో రెండేళ్లలోనే సొరంగం పనులు పూర్తి చేసి సాగు, తాగునీటిని అందించి తీరుతామని స్పష్టం చేశారు.

బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఉన్న ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించారు. సొరంగంలోని 14వ కిలోమీటర్ వద్ద సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు కూలిపడి టీబీఎం యంత్రాలతో పాటు పూర్తిగా యంత్ర సామగ్రి మట్టిలో కూరుకుపోయిందని కార్మికులు సైతం చిక్కుకుపోయారని పేర్కొన్నారు.

మరో 15 రోజుల్లో 150 మీటర్ల పొడవున ఉండే మట్టి శిథిలాలను తోడి కార్మికుల ఆనవాళ్లను గుర్తిస్తామని రెస్క్యూ బృందాలు భీమా వ్యక్తం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

నీటి ఊటతోపాటు బురద రోజు రోజుకు పేరుకుపోతూనే ఉంద ని అయినా వాటన్నింటిని దాటుకుం టూ టీబీఎం యంత్రాలను బయటికి తొలగిస్తూ కార్మికుల ఆనవాళ్లు గుర్తించేందుకు సుమారు 600 మం ది రెస్క్యూ బృందాలు అహోరాత్రు లు శ్రమిస్తున్నాయని పేర్కొన్నారు.

మంత్రి వెంట ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి, కలెక్టర్ బాదావత్ సంతోష్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ ఉన్నారు.