23-02-2025 05:51:48 PM
నిర్మల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం నుండి టన్నెల్ ద్వారా ఎస్ఎల్బీసీ పనుల్లో భాగంగా కూలిపోయిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.