25-03-2025 12:56:52 AM
సంగారెడ్డి, మార్చి 24 (విజయక్రాంతి): జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 69 దరఖాస్తుదారులు త మ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు.
రెవెన్యూ శాఖ 25 , పౌరసరఫరాల శాఖ 02,సర్వే ల్యాండ్ 3, పంచా యతీ , పి టి విభాగం 7, పంచాయతీరాజ్ 4,డి.ఆర్.డి.ఓ 3,మున్సిపల్ 10, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 5, విద్యాశాఖ 2, వ్యవసాయ శాఖ 3, పశు వైద్య శాఖ 2, వైద్య & ఆరోగ్యశాఖ 3.ఈ కార్యక్రమంలో అదన పు కలెక్టర్ మాధురి, డీ.ఆర్.ఓ పద్మజ రాణి, జడ్పీసీఈఓ జానకి రెడ్డి,ఆర్.డి.ఓ లు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.