ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో 6 సంవత్సరాల బాలికపై 17 సంవత్సరాల బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అభం శుభం తెలియని ఆరేళ్ల పసిపాపను మాయమాటలు చెప్పి ముగ్గురు పిల్లలను ఒకే గదిలోకి తీసుకెళ్లి ఇద్దరిపై అఘాయిత్యానికి పాల్పడగా, మూడో అమ్మాయి పారిపోయి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటనపై కులంలోనే పంచాయతీ చేయాలని విషయాన్ని బహిర్గతం కాకుండా గోప్యంగా ఉంచారు.