calender_icon.png 3 February, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరుగురు గురుకుల విద్యార్థులు అదృశ్యం

03-02-2025 02:33:10 PM

కోదాడ,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట ఆవాస గ్రామమైన నెమలిపురి ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు ఆదివారం నుంచి కనిపించకపోయారు. దీంతో గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్(Kodada Rural Police Station)లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ ఘటనపై స్పందించిన కోదాడ రూరల్ పోలీసులు 24 గంటల్లోనే ఈ మిస్సింగ్ కేసును చేదించి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం నింపారు. శనివారం రాత్రి 10 వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ నిర్వహించగా వారిలో కొంత మంది విద్యార్థులు మద్యం సేవించి గొడవ పడ్డారని ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ మందలించారని దీంతో మనస్థాపంతో కనిపించకుండా పోయారని సహా విద్యార్థులు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్ ఆవరణలోకి మద్యం ఎలా వచ్చింది అనే విషయంపై  గురుకుల స్కూల్లో జరుగుతున్న పలు సంఘటనలపై విచారణ చేస్తున్నామని కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.