calender_icon.png 26 October, 2024 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

26-10-2024 04:42:26 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద వేగంగా దూసుకోచ్చిన కారు అదుపుతప్పి లారీని ఢీకోట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు టైరు పగిలి లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జు అయింది. మృతులు అనంతపురం ఇస్కాన్ టెంపుల్ కు చెందిన భక్తులుగా గుర్తించారు. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అధికవేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.