calender_icon.png 1 October, 2024 | 10:58 PM

మంచిర్యాలలో 650 పడకల ఆసుపత్రి

10-09-2024 04:23:27 AM

ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు 

మంచిర్యాల, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి) : మంచిర్యాలలో త్వరలోనే 650 పడకల ఆ సుపత్రి నిర్మాణం చేపడుతామని, హైదరాబాద్‌లాంటి పట్టణాలకు వెళ్లకుండా మం చిర్యాలలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్ర ధాన ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చే శారు. ఎంసీహెచ్‌ను జీజీహెచ్‌లోకి తరలించ డం వల్ల రోగులకు ఏమైనా ఇబ్బందులు త లెత్తుతున్నాయా అని రోగులను, గర్భిణుల ను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలా ంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే వెం ట మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి ఉన్నారు.