న్యూఢిల్లీ, అక్టోబర్ 1: తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేసిన స్పెషల్ ఇన్వెస్ట్గేషన్ టీం(సిట్) దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళవారం తెలిపారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపి వేసినట్టు ఆయన వెల్లడించారు.