గజ్వేల్ తహసీల్దార్ కు శ్రీగిరి పల్లి ముస్లింల వినతి
గజ్వేల్,(విజయక్రాంతి): ఎన్నో తరాలుగా ప్రార్థనల కోసం వినియోగిస్తున్న మా భూములను వేరే వారికి కేటాయించాలరన్నారు. మా భూములు మాకే కేటాయించి, ఈద్గా, కబరస్తాన్ లక్ కోసం అభివృద్ధి చేయాలని గజ్వేల్ మండలం శ్రీగిరి పల్లి గ్రామ ముస్లింలు తహసిల్దార్ ను కోరారు. ఈ మేరకు గురువారం తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రావణ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... శ్రీగిరి పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 323లో 4.20 ఎకరాల భూమిలో ఈద్గాగా నిర్వహిస్తూ ప్రార్థనలు చేస్తున్నట్లు శ్రీగిరి పల్లి మజీద్ కమిటీ అధ్యక్షుడు సలాం షరీఫ్ తెలిపారు. గత ప్రభుత్వం ఈ భూమిని ఇతరులకు కేటాయించిందని దాని రద్దుచేసి మాభూమి మాకే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.