సీఈఐఆర్తో 1,200 సెల్ఫోన్ల గుర్తింపు
రాజన్న సిరిసిల్ల, జూలై 29 (విజయక్రాంతి): పొగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచారని ఎస్పీ అఖిల్మహాజన్ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో 78 ఫోన్లను రికవరీ చేసి సంబంధీకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో సీఈ ఐఆర్ పోర్టల్ దారా రూ.కోటి విలువైన 1,200 ఫోన్లు గుర్తించి 1,019 ఫోన్లు సబంధీకులకు అందించినట్లు తెలిపారు. 84శాతం ఫోన్ల రికవరీతో రాష్టంలో మొదటి స్థానంలో జిల్లా నిలిచిందన్నారు. ఫోన్లను రికవరీకి కృషి చేసిన ఐటీ కోర్ ఎస్సై కిరణ్కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్ను ఎస్పీ అభినందించి, రివార్డులను అందజేశారు.