25-03-2025 08:42:25 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ ప్రాథమిక సహకార సంఘం వైస్ చైర్మన్ అంబర్ సింగ్ మంగళవారం రాంపూర్ తండాలో గుండెపోటుతో మృతి చెందారు. రైతుల కోసం ఎంతో పనిచేశారు. తెలంగాణ రాంపూర్ తండాలో తాను పండించిన వడ్లను ఆరబెడుతుండగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే అంబర్ సింగ్ గుండెపోటుతో మృతి చెందడం తండవాసులను తీవ్రంగా కలచివేసింది.