calender_icon.png 28 October, 2024 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదుల సహకార గృహనిర్మాణ సంఘం అధ్యక్షుడిగా సింగిరెడ్డి లక్ష్మారెడ్డి

24-07-2024 04:51:14 PM

కరీంనగర్: కరీంనగర్ జిల్లా న్యాయవాదుల సహకార గృహనిర్మాణ సంఘం అధ్యక్షుడిగా బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది సింగిరెడ్డి లక్ష్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాద్యక్షులుగా తిరుమలదేవి, ప్రదాన కార్యదర్శిగా నగునూరి పరమేశ్వర్, కోశాధికారిగా ధనుక రాజశేఖర్‌ రావులు ఎన్నికయ్యారు. మంగళవారము జరిగిన ఈ ఎన్నికలలో 341 న్యాయవాదులు సబ్యత్వం కలిగి ఉండగా 241మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వీరూ 9 మంది  డైరెక్టర్లుగా నగునూరి పరమేశ్వర్, సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, పివి.రాజ్‌కుమార్, హర్కాల చక్రధర్, దాసరి రాంరెడ్డి, పూరెళ్ల రాములు, ఎస్ సి ఎస్ టి విభాగాల్లో ధనుక రాజశేఖర్ రావు . మహిళా విభాగం లో పొత్తూరి భాగ్యలక్ష్మి,  మూల తిరుమలా దేవిలను ఎన్నుకున్నారు. ఈ నియామకం పట్ల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రఘునందన్ రావు,  బల్మూరి మహేందర్ రావు, రాష్ట్రం సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు న్యాయవాది ఉప్పుల అంజనీప్రసాద్, ఎజిపి లు కె.లక్ష్మయ్య,కూర శ్రీనివాస్ రెడ్డి,  కాంగ్రెస్ నాయకులు రాచకొండ ప్రభాకర్, కుమారస్వామి, సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.