calender_icon.png 21 October, 2024 | 3:42 AM

చికిత్స పొందుతూ సింగరేణి కార్మికుని మృతి

20-10-2024 08:37:34 PM

మందమర్రి,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఓ సింగరేణి కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కరీంనగర్ లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  కరీంనగర్ లోని పాత బస్టాండ్ రాజీవ్ నగర్ ప్రాంతానికి చెందిన నాగుల సంతోష్(24 ) శ్రీరాంపూర్ ఏరియా లోని ఆర్కే 7 గనిలో బదిలీ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గత గురువారం ఆర్కే7 గనిలో మొదటి షిఫ్ట్ విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అది గమనించిన స్థానికులు క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతులు చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. కారుణ్య నియామకం కింద ఇటీవల విధుల్లో చేరిన తమ కుమారుడు వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటారనుకుంటే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వృద్ధ తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రామకృష్ణాపూర్ పోలీసులు పేర్కొన్నారు.