18-03-2025 01:05:06 AM
కవితా నాయుడు
కొత్తగూడెం, మార్చి17 (విజయక్రాంతి ) సమిష్టిగా పనిచేసి సింగరేణి సూపర్ ను అభివృద్ధి పథంలో నడిపించాలని జియం పర్సనల్ ఐ ఆర్, పీఎం అండ్ వెల్ఫేర్ కవితా నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం సింగరేణి సూపర్ బజారుపై ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు.
సింగరేణి సూపర్ బజారును అభివృద్ధి పథంలో నడిపించడం , డిజిటల్ పేమెంట్స్ పై దృష్టి సారించడం, అన్ని రకాలైనప్రొవిజన్స్ అందుబాటులో ఉంచడం, ఉద్యోగులకు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంచుతూ, సేల్స్ పెంచాల్సిందిగా అధికారుల ఆదేశించారు.సింగరేణి సూపర్ బజార్ యాజమాన్యానికి, అవసరమైన సహాయ సహకారాలు, సింగరేణి తరపున అందిస్తామన్నారు.
ఈ సమావేశంలో, ఎండి సూపర్ బజార్ శ్రీ విలాస్ శ్రీనివాస్,కొత్తగూడెం డివిజనల్ మేనేజర్ శ్రీ సిహెచ్ అశోక్, గోదావరిఖని శ్రీరాంపూర్ డివిజనల్ మేనేజర్స్ శ్రీ నరేన్ చక్రవర్తి, పి రాజు, మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ శ్రీ ప్రసాద్, ఈ సమావేశంలో పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు