calender_icon.png 13 October, 2024 | 6:19 PM

సింగరేణి స్థాయి క్రీడలు ఘనంగా నిర్వహించాలి : జి.యం

13-10-2024 04:35:56 PM

కొత్తగూడెం: వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ సింగరేణి ఇల్లందు ఏరియా ఆధ్వర్యంలో స్థానిక వై.సి.ఓ.ఎ క్లబ్, 24 ఏరియా,  సింగరేణి స్కూల్ గ్రౌండ్, జేకే కాలనీ నందు ఈ నెల 15,16  తేదీలలో కంపెనీ స్థాయి బాస్కెట్ బాల్, లాన్ టెన్నిస్ క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భముగా జి.యం.జాన్ ఆనంద్ మాట్లాడుతూ.. సింగరేణి వ్యాప్తంగా (6) రీజియన్ లెవల్ లో ఎంపిక అయిన క్రీడాకారులు ఇల్లందు ఏరియాలో జరిగే కంపెనీ స్థాయి పోటిలలో  పాల్గోంటారని తెలిపారు. ఈ క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులు కోల్ ఇండియా లెవెల్ కు సెలెక్ట్ అవుతారని తెలిపారు. ఇతర ఏరియా నుండి వచ్చే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పర్సనల్, సివిల్, వర్క్ షాప్ ఇతర విభాగాల అధికారులకు ఆదేశాలు జిఎం జారీచేసారు.