హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): వరద బాధితులకు సాయం చేసేందుకు సింగరేణి ఉద్యోగులు ముందుకొచ్చా రు. సింగరేణి అధికారులు, ఉద్యోగు లు తమ ఒకరోజు బేసిక్ సాలరీ రూ.10.25 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ క్రమం లో సింగరేణి సీఎండీ, గుర్తింపు, ప్రాతినిధ్య, అధికార సంఘాల నాయకులు విరాళానికి సంబంధించిన బాండ్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో గురువారం సీఎం రేవంత్రెడ్డికి అందజేశారు. వరదల నేపథ్యం లో తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సహాయ చర్యలకు తోడ్పాటు గా ఈ వితరణ ప్రకటించామని తెలిపారు. సింగరేణి ఉద్యోగుల తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమా ర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివ రావు, మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.