calender_icon.png 24 February, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండువగా సింగాపురం శ్రీనివాస కల్యాణం

13-02-2025 02:03:24 AM

హుజురాబాద్, ఫిబ్రవరి12: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం సింగపూర్ లో శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభ వంగా బుధవారం నిర్వహించారు. ఈ కళ్యా ణానికి మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియో జకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ బాబులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు.

నియోజక వర్గంలోని ప్రజలకు మంచి పంటలు పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాల తో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగ వంతున్ని కోరుకుంటున్నట్లు వారు తెలిపా రు. శ్రీ పద్మాగోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మో త్సవాల్లో భాగంగా చివరిరోజైన బుధవారం రోజున స్వామివారి కల్యాణోత్సవం నిర్వ హించారు.

ఈ కళ్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తుల గోవింద నా మస్మరణలు, వేద పండితుల మంత్ర ఘో షణల మధ్య కల్యాణ మహోత్సవాన్ని అద్భు తంగా నిర్వహించారు. అనంతరం వేద పండి తుల మంత్ర పఠనం, వ్యాఖ్యానం భక్తులను ఆకట్టుకుంది. కల్యాణోత్సవాన్ని పురస్కరిం చుకుని, ఉత్సవ విగ్రహాలకు, స్వామివారి, అమ్మవారి మూల విరాట్టు విగ్రహాలకు ప్ర త్యేక అలంకరణలు చేశారు.

దేవాలయాన్ని పూలమాలలతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.వివాహ ఘట్టాలను, మాంగళ్య ధార ణ వంటి ఘట్టాలను వివరిస్తూ,ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కల్యాణాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో వొడితల కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.