మారుతున్న సీజన్ కారణంగా మన చర్మం పొడిబారటం, చీలికలు ఏర్పడటం జరుగుతుంది. ముఖ్యంగా పాదాల విషయంలో ఈ సమస్య తరుచుగా కనిపిస్తుంది. పాదాల రక్షణకై వంటింట్లోనే ఉండే పదార్థాలతో వాటిని అందంగా మార్చాలంటే కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది..!
- మూడు నిమ్మకాయలు, ఒక చెంచా చక్కెర, ఒక చెంచా బాదం నూనె, పది నుంచి పదిహేను పుదీన ఆకులు తీసుకోవాలి.
- పుదీన ఆకులు, నిమ్మకాయ ముక్కలను (తొక్కతో సహా) మిక్సీలో గ్రైండ్ చేయాలి.
- అందులో చక్కెర, బాదం నూనె కలిపితే పాదాలకు స్క్రబ్ రెడీ.
- దీన్ని పాదాలు, మడమలు, వేళ్ల మధ్య పట్టించి ఆరిన తర్వాత చెత్తో ఐదు నుంచి పది నిమిషాల సేపు వలయాకారంగా మర్దన చేసి గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేయాలి.
- వర్షాకాలంలో పాదాలు నాని ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండటానికి ఈ స్క్రబ్లో చిటికెడు పసుపు కలుపుకోవాలి.