22-01-2025 12:00:07 AM
అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి వి. వసంత మాధురి...
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఈ నెల17 నుంచి 21 వరకు గుల్మార్గ్, కాశ్మీర్లో జరిగిన 4 వ నేషనల్ ఐస్ కర్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో తెలంగాణ నుండి సీనియర్ ఉమెన్స్ టీంలో పాల్గొన్న లయన్ వి. వసంత మాధురి, ఎం. నాగ అక్షయ, కునదొడ్డి స్టెల్లా దీపిక, కునాదొడ్డి రచ్చేల్ రజత పథకాలు కైవసం చేసుకున్నారని కర్లింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి వి. వసంత కుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ నుండి బుర్ర మల్లికార్జున్ పవన్ కుమార్, జి. కృష్ణమూర్తి, నీలా సాయి సోహాన్లతో పాటు ఆంధ్రప్రదేశ్, జమ్ముకాశ్మీర్, కర్ణాటక, తమిళనాడు, లడక్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ మొత్తం 18 రాష్ట్రాల నుండి 300 మందికి పైగా పోటీదారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి మొహ్మద్ డ్యానిష్, మొహ్మద్ ఆర్షద్లు పాల్గొన్నారు.