నిజామాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): దుర్గాష్టమి సందర్భంగా ప్రతిష్టించ నున్న దేవి విగ్రహాలకు ధన్పాల్ లక్ష్మీబాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మంగళవారం పట్టు చీరలు పం పిణీ చేశారు. గత 11 ఏళ్లుగా నవరాత్రుల సం దర్భంగా ట్రస్ట్ ద్వారా నిజామాబాద్ నగరం లో ప్రతిష్టించనున్న దాదాపు 250 మండపాలకు పట్టు చీరలను బహుకరిస్తారు.
మంగళవారం మార్వాడి గల్లిలో ఉన్న ధన్పాల్ సూర్యనారాయణ కార్యాలయంలో చీరలు పంపిణీ చేశారు. హిందూ ధర్మ రక్షణకు, హిందూ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే ప్రతి కార్యానికి తన ట్రాస్ట్ ద్వారా సేవలందిస్తానని ఆయన అన్నారు.