calender_icon.png 9 October, 2024 | 6:50 PM

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేటకు నాలుగు పతకాలు

09-10-2024 04:49:57 PM

సిద్దిపేట (విజయక్రాంతి): హనుమకొండలో రెండు రోజులు జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు రెండు వెండి, రెండు కాంస్య పతకలు సాధించారని సిద్దిపేట జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి కర్రోల్ల వెంకటస్వామి గౌడ్ తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ కు చెందిన గ్యార లీలా, ఆనంద్ డేకథ్లాన్, హై జంప్ రెండు విభాగలలో 2 కాంస్య పతకలు, సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కొండపాకకు చెందిన నగేష్ అండర్ -18 జవలియన్ త్రో వెండి పతకం, ఇదే కేటగిరీలో షాట్ పుట్ లో ఎస్డిఏఏ చెందిన వాసు వెండి పతకం సాధించారు.

జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి జయ దేవ్, సిద్దిపేట స్పోర్ట్స్ క్లబ్ కన్వీనర్ పాల సాయిరాం, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి సౌందర్య, వ్యాయామ ఉపాధ్యాయులు పన్యాల రామేశ్వర్ రెడ్డి, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు బండారుపల్లి శ్రీనివాసులు, ఏరువ అశోక్, కడకంచి ఉప్పలయ్య, కామిరెడ్డి రవీందర్ రెడ్డి, బయ్యారపు కనక రెడ్డి, శిక్షకులు ప్రభాకర్, కృష్ణ కుమార్, నిషంక్ గౌడ్ ,సాగర్ తదితరులు అభినందించారు.