calender_icon.png 24 October, 2024 | 4:07 AM

ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకలకు సిద్దిపేట ఎన్ఎస్ఎస్ వాలంటీర్

12-08-2024 12:59:20 PM

సిద్దిపేట అర్బన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతి పత్తి) ఎన్.ఎస్ ఎస్ వాలంటీర్ సోమరాపు భాను ఈ నెల 15 వ తేదీన ఢిల్లీలో జరిగే స్వాతంత్ర వేడుకలకు  తెలంగాణ రాష్ట్రం నుంచి హాజరు కానున్నాడు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. సునీత మాట్లాడుతూ ఎన్.ఎస్. ఎస్ వాలంటీర్ ఎంపిక కళాశాల కీర్తిని మరింతగా పెంచుతుందని పేర్కొన్నారు. తోటి విద్యార్థులు భనును స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.  ఎస్. భాను, ప్రోగ్రాం అధికారి శ్రద్దనందంను అభినందించారు