calender_icon.png 25 October, 2024 | 1:49 AM

శుభమస్తు

05-08-2024 01:18:12 AM

  • బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి) : పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన తెలంగాణ ప్రతినిధి బృందానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ  సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో భారీ ప్రతినిధి బృందం పెట్టుబడుల కోసం బయలుదేరిన నేపథ్యంలో పెట్టుబడుల ఆకర్షణలో విజయం సాధిం చాలని అకాంక్షించారు. 

గత పది సంవత్సరాలలో బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఆధ్వర్యంలో అనేక మల్టీనేషనల్ కంపెనీలు ప్రపంచ దిగ్గజ సంస్థ లను హైదరాబాద్‌కు తీసుకు రాగలిగామని, ఈ సందర్భంగా ఆయా కంపెనీలతో తెలంగాణకు ప్రత్యేక అనుబంధం ఏర్పరచగలిగమన్నారు. తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక దిగ్గజ కంపెనీలతో రాష్ట్రంలో బలమైన వ్యాపార బంధం వేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన వ్యాపార వాణిజ్య విధానాలు, టీఎస్ ఐపాస్ వంటి అనుమతుల ప్రక్రియ వంటి వాటితో ఇప్పటికే తెలంగాణకు తాము తీసుకువచ్చిన కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలో కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రాధ్యానత ఇస్తున్నట్లు తెలిపారు.  మాజీ సీఎం కేసీఆర్  ఆధ్వర్యంలో 10 సంవత్సరాలో పాలసీల పరమైన విప్లవాత్మక నిర్ణయాలతో పాటు, మౌలిక వసతుల కల్పన ద్వారా తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణలో ప్రత్యేక స్థ్ధానాన్ని కల్పించామన్నారు.

గత పది ఏళ్లలో రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకురావడంతో పాటు 24 లక్షల ఉపాధి అవకాశాలను ప్రైవేటు రంగంలో సృష్టించగలిగామన్నారు. సీఎం ప్రతినిధి బృందం ఇలాంటి అనేక కంపెనీ లతో మరోసారి చర్చలు నిర్వహిస్తు న్న నేపథ్యంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కేవలం తెలంగాణనే తమ ప్రథమ ప్రాధాన్యంగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం తాము దశాబ్దకాలంగా నిర్మించిన బలమైన పెట్టుబడుల పునాదులపై మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించాలన్నారు.