02-03-2025 07:10:20 PM
డీసీసీ ప్రధానకార్యదర్శి సూర సమ్మయ్య...
బసంత్ నగర్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివని డీసీసీ ప్రధానకార్యదర్శి సూర సమ్మయ్య కొనియాడారు. ఆదివారం దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను పాలకుర్తి మండలం టోల్ గేట్ వద్ద సమ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ప్రతిఒక్కరూ శ్రీపాదరావు ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.