calender_icon.png 1 April, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు

29-03-2025 12:18:04 PM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు(Sravan Rao) సిట్ విచారణకు హాజరైయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్(Jubilee Hills Police Station)లో శ్రవణ్ రావు సెట్ విచారణకు హాజరయ్యాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు ఏ6గా ఉన్నాడు. సుప్రీంకోర్టు అరెస్ట్ నుంచి ఊరట కల్పించడంతో శ్రవణ్ విచారణకు వచ్చాడు. విచారణకు సహకరించాలని సుప్రీం కోర్టు(Supreme Court) శ్రవణ్ రావును ఆదేశించింది. శ్రవణ్ రావును అరెస్ట్ చేయవద్దని పోలీసులకు సుప్రీం కోర్టు ఆదేశించింది. శ్రవణ్ ను విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (Special Investigation Team) శ్రవణ్ రావుకు శనివారం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. మార్చి 26న రావు కుటుంబ సభ్యులకు నోటీసులు అందాయి. గత ఏడాది మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ప్రారంభమైన దర్యాప్తు నుండి ఈ కేసు వచ్చింది. కేసు వార్తల తర్వాత, శ్రావణ్ రావు లండన్ నుండి అమెరికాకు పారిపోయాడు. అతను అజ్ఞాతంలో ఉండగానే అతని అరెస్టు కోసం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయబడింది.