సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి సబితారెడ్డి సవాల్
చేవెళ్ల, అక్టోబర్ 4: తమకు ఫామ్హౌస్లు ఎక్కడ ఉన్నాయో చూపించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి.. సీఎం రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహనతో ఉండాలని హితవు పలికారు. శుక్ర వారం మాజీ హోం మంత్రి ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా మొయినాబాద్, చేవెళ్ల మండల కేంద్రాల్లో ఉన్న విగ్రహాలతో పాటు స్వగ్రామమైన కౌకుంట్ల గ్రామంలో ఇంద్రారెడ్డి సమాధి వద్ద ఆమె నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం హోదాలో ఉన్నప్పటికీ ఏది మాట్లాడాలో.. ఏది మాట్లా డకూడదో తెలియని స్థితిలో రేవంత్రెడ్డి ఉన్నారని విమర్శించారు. తన కుమారులకు ఫామ్హౌస్లు ఉన్నాయని ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు.
తనకు తెలియకుండా వ్యవసాయ క్షేత్రాలు ఎక్కడున్నాయో ఆయనే చూపిస్తే బాగుంటుందని సూచించారు. ఫామ్హౌస్లు ఉన్నాయని నిర్ధారిస్తే చట్టరీత్యా కూల్చివేసుకోవచ్చని, లేనివి ఉన్నట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.