సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్...
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు జాతీయస్థాయిలోనూ రాణించాలని సింగిల్ విండో చైర్మన్, నెట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్ అన్నారు. జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన కీర్తన, దీప్తి, వెంకటేష్ లను ఆదివారం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతీయస్థాయి క్రీడలకు జిల్లా విద్యార్థులు ఎంపిక రావడం క్రీడల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి అహ్మద్, సత్యనారాయణ, సెమ్మి హుల్లహాక్, పిఈటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.