calender_icon.png 23 October, 2024 | 9:47 PM

అనుమతులు లేకుండా షూటింగ్

23-10-2024 12:00:00 AM

ఇద్దరిపై కేసు నమోదు

ఘట్‌కేసర్, అక్టోబర్ 22: అనుమతులు లేకుండా షూటింగ్ చేస్తున్న ఇద్దరిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళ వారం సాయంత్రం హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిలోని విజయపురి కాలనీ సమీపంలో ఉన్న సూర్య హాస్పిటల్ వద్ద చిరంజీవ వెబ్ సిరీస్ షూటింగ్ చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి.

దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనుమతులు తీసుకోకపోవడంతో పాటు ట్రాఫిక్ జామ్‌కు, న్యూసెన్స్‌కు కారణమైన వెబ్ సిరీస్ ప్రొడక్షన్ మేనేజర్ జగదీశ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ మేనేజర్ సల్లా వెంకటేశ్‌పై కేసు నమోదు చేశారు.