25-03-2025 12:00:00 AM
వరుణ్తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్-కామెడీని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘వీటీ15’ అనే మేకింగ్ టైటిల్తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా ఎంపికైంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై రూపొందుతున్న వరుణ్తేజ్ కెరీర్లో ఒక ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్గా మారుతుందని చిత్రబృందం చెబుతోంది.
అయితే, తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా సోమవారమే హైదరాబాద్లో ప్రారంభిస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు థమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.