మహబూబ్నగర్, జూలై 26 (విజయక్రాంతి): జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సొంత నిధులతో నియోజకవర్గంలోని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు షూ సమకూర్చారు. ఎమ్మెల్యే వాటిని శుక్రవారం హైదరాబాద్లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. వారి వెంట తాండూర్ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.