calender_icon.png 4 October, 2024 | 4:57 PM

వేమనపల్లిలో బీఆర్ఎస్ కు షాక్

04-10-2024 02:23:03 PM

ఎమ్మెల్యే సమక్షంలో 100కు పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిక

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఈ పరిణామం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టంగానే నాయకులు భావిస్తున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన 100కు పైగా కార్యకర్తలు మాజీ జెడ్పిటిసి రుద్రభట్ల సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సాబీర్ ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చిన బిఆర్ఎస్ కార్యకర్తలను ఎమ్మెల్యే వినోద్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేమనపల్లి మాజీ ఉపాధ్యక్షుడు ఓడిల్ల రాజన్న, నీల్వాయి మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి, నీల్వాయి తాజా మాజీ సర్పంచ్ గాలి మధు, నాయకులు చెన్నూరి పురుషోత్తం, మధుసూదన్, చేపూరి శంకర్ గౌడ్, చేపూరి సత్యనారాయణ గౌడ్ లతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.