24-03-2025 06:06:54 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ శివరాం మందిర్ దేవస్థానం తైబజార్ అంగడి బజార్ బహిరంగ వేలం పాట సోమవారం నిర్వహించారు. ఒక సంవత్సరమునకు హెచ్చు పాటదారుడుగా గుండ్ల రాజమణి దోమకొండ (4) నాలుగు లక్షల ఇరవై ఆరువేల రూపాయలకు దక్కించుకున్నారు. చైర్మన్ కొండ అంజయ్య, ధర్మకర్తలు కార్యనిర్వాహణాధికారి సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.