calender_icon.png 21 October, 2024 | 10:54 AM

మైత్రి చేతికి శివం భజే నైజాం హక్కులు

30-07-2024 12:05:00 AM

ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న విడుదలకు సిద్ధం గా ఉన్న ‘శివంభజే’ చిత్రాన్ని నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థ దక్కించుకుంది. గంగా ఎంటర్ టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం సోమవారం సెన్సార్ పూర్తి చేసుకొని, యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఇందులో హీరో అశ్విన్ సరసన దిగంగనా సూర్యవంశీ కథానాయకిగా కనిపించనుంది. ఇంకా ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీశర్మ, బ్రహ్మాజీ, అయ్యప్పశర్మ, షకలక శంకర్, ఇయనా సుల్తానా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించింది. ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో మిళితమైన కథ తెరకెక్కించినట్టు ట్రైలర్‌లో అర్థమైంది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బడిస; ఫైట్స్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ; డీవోపీ: దాశరథి శివేంద్ర; ఎడిటర్: ఛోటా కె ప్రసాద్; నిర్మాత: మహేశ్వర్‌రెడ్డి మూలి; దర్శకత్వం: అప్సర్.