ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్
గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటించిన చిత్రం ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహించారు. మంగళవారం హైదరాబాద్లో ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మేరకు చిత్ర బృందం నిర్వహించిన కార్యక్రమానికి విశ్వక్ సేన్, తమన్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా బాగుంది. అశ్విన్ కెరీర్లో ఇది నిలిచిపోతుందనిపిస్తుంది. ఆగస్ట్ 1న అశ్విన్కు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘అశ్విన్ ఏ సినిమా చేసినా ముందు నాకు చూపిస్తాడు. దిగంగనాకి ఈ చిత్రం ద్వారా పెద్ద విజ యం చేకూరాలి.
తమన్ ఇచ్చిన ఆర్ఆర్ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. టీంకు ఆల్ ది బెస్ట్’ అని చెప్పకొచ్చారు. ‘కళాకారుడికి ప్రతిభ మాత్రమే ఉంటే సరిపోదు. కసి కూడా ఉండాలి. అశ్విన్కు ఆ కసి ఉంటుంది’ అని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. ట్రైలర్లో ‘ఆట మొదలెట్టావా శంకరా..’, ‘నీ వెనకుండి నడిపిస్తున్న ఆ గుంటనక్క గురించి కూడా తెలుసురా నా కొడకా’ వంటి మాస్ డైలాగులతో అలరించాడు అశ్విన్. మురళీ శర్మ, తనికెళ్ల భరణి, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.