calender_icon.png 16 October, 2024 | 7:45 PM

షెహబాజ్ జైశంకర్ కరచాలనం

16-10-2024 03:45:19 AM

ఇస్లామాబాద్, అక్టోబర్ 15: పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం కలిశారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన షాంఘై సహకార సమాఖ్య (ఎస్‌సీవో) సభ్య దేశాధినేతల (సీహెచ్‌జీ) 23వ సమావేశంలో అ సన్ని వేశం చోటుచేసుకొన్నది. ఈ సమావేశానికి భారత్ తరఫున హాజరైన జైశంకర్.. ఎస్‌సీవో సభ్య నేతలకు షరీఫ్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కరచాలనం చేసి పలకరించుకొన్నారు. భారత విదేశాంగమంత్రి పాకిస్థాన్‌లో పర్యటించటం 9 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి.